విధులు మరియు ప్రకటనలు
సమాధులను ప్రతిష్ఠించడం


సమాధులను ప్రతిష్ఠించడం

సమాధిని ప్రతిష్ఠించడానికి మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న వారు:

  1. ప్రార్థనలో వలె పరలోక తండ్రిని సంబోధిస్తారు.

  2. అతను మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారంతో వ్యవహరిస్తున్నాడని పేర్కొంటారు.

  3. మరణించినవారి మృతదేహానికి విశ్రాంతి స్థలంగా శ్మశానవాటికను అంకితం చేసి, ప్రతిష్ఠిస్తారు.

  4. పునరుత్థానము వరకు (తగిన చోట) ఆ స్థలం పవిత్రంగా ఉండాలని మరియు రక్షించబడాలని ప్రార్థిస్తారు.

  5. కుటుంబాన్ని ఓదార్చమని పరలోక తండ్రిని అడుగుతారు మరియు ఆత్మచేత మార్గనిర్దేశం చేయబడిన ఆలోచనలను వ్యక్తపరుస్తారు.

  6. యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.

సంఘ సభ్యుని మృతదేహాన్ని దహనం చేస్తే, అధ్యక్షత్వం వహించే నాయకుడు తన తీర్పును ఉపయోగించి బూడిదను ఉంచే స్థలాన్ని ప్రతిష్ఠి చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు.