సమాధులను ప్రతిష్ఠించడం
సమాధిని ప్రతిష్ఠించడానికి మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న వారు:
-
ప్రార్థనలో వలె పరలోక తండ్రిని సంబోధిస్తారు.
-
అతను మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారంతో వ్యవహరిస్తున్నాడని పేర్కొంటారు.
-
మరణించినవారి మృతదేహానికి విశ్రాంతి స్థలంగా శ్మశానవాటికను అంకితం చేసి, ప్రతిష్ఠిస్తారు.
-
పునరుత్థానము వరకు (తగిన చోట) ఆ స్థలం పవిత్రంగా ఉండాలని మరియు రక్షించబడాలని ప్రార్థిస్తారు.
-
కుటుంబాన్ని ఓదార్చమని పరలోక తండ్రిని అడుగుతారు మరియు ఆత్మచేత మార్గనిర్దేశం చేయబడిన ఆలోచనలను వ్యక్తపరుస్తారు.
-
యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.
సంఘ సభ్యుని మృతదేహాన్ని దహనం చేస్తే, అధ్యక్షత్వం వహించే నాయకుడు తన తీర్పును ఉపయోగించి బూడిదను ఉంచే స్థలాన్ని ప్రతిష్ఠి చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు.